Sunday 16 February 2020

లక్ష దీవుల వంటకాలు అక్కడ ప్రత్యేకత



లక్ష దీవులు అంటే చాలా మందికి కేవలం మన దేశానికి చెందిన దీవులు మాత్రమే.కాని కేరళ కి చెందిన ముగ్గురు యువకులు మాత్రం ఆ దీవుల కి చెందిన రకరకాల వంటకాల్ని రుచి చూపించడానికి కేరళ లోని కోజికోడ్ లో ఒక హోటల్ ని తెరిచారు.హమిదుల్లా మహ్మద్,నౌషాద్, నిషాల్ పరంబిల్ అనే విద్యార్థులు సరదాగా తమ పాకెట్ మనీ కోసం ఈ దుఖాణం ని తెరిచారు.అయితే అది ఇప్పుడు  మంచి లాభాల్ని కూడా తెచ్చిపెడుతోంది.సముద్ర చేపలు,కొబ్బరి వంటకాలు అన్నీ కలిపి 20 రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి.కేవలం మేము 700 చదరపు అడుగుల స్థలం లోనే షాపు తెరిచాము.కష్టమర్లు బాగా సమకూరారు.ప్రస్తుతం మేము కొన్ని విదేశాలకి కూడా మా ఉత్పత్తుల్ని పంపిస్తున్నాము.ప్రభుత్వం అందిస్తున్న సాయం తో లక్ష దీవుల్లో కూడా బ్రాంచ్ పెట్టబోతున్నాము.టునా పికిల్,కోకోనట్ వినెగర్,టునా మాస్ పాపడ్,టునా మాస్ ఫ్రై,ఇలాంటివే కాకుండా లక్ష దీవుల్లో లభ్యమయ్యే ఔషధ ఉత్పత్తుల్ని కూడా విక్రయిస్తున్నాము అని ఆ యువకులు అంటున్నారు.    

Tuesday 8 October 2019

గుడి సముదాన్ని రక్షించమని కోరుతున్న చంబల్ బందిపోట్లు



బందిపోట్లు గా జనాల్ని ఒకనాడు గడ గడ లాడించిన చంబల్ లోయ నివాసులైన మొహర్ సింగ్ గుర్జర్,నిర్భయ్ గుర్జర్ చంబల్ లోయ లో ఉన్న బాటేశ్వర్ దేవాలయ సముదాయాల్ని ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని వాటిని సమ్రక్షించాలని కోరుతున్నారు.వాళ్ళు ఈ మేరకు ప్రధానికి కూడా వినతి పత్రాలు సమర్పించారు.భూతేశ్వర్ అనే మాట బాటేశ్వర్ అయి ఉంటుందని పరిశోధకుల అంచనా.ఇంతకీ గుళ్ళ ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 400 వరకు ఒకే కాంప్లెక్స్ లో ఉంటాయి.రమారమి 25 కి.మీ.ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చిన్న చిన్న గుళ్ళు దాదాపు ఏడు వందల ఏళ్ళ క్రితం గుర్జర-ప్రతిహార రాజులు నిర్మించినవని చరిత్ర.

ఈ సముదాయాన్ని మన దేశపు అంగోర్ వాట్ టెంపుల్ గా పిలుస్తారు.అనేక ఏళ్ళ పాటు అడివి లో ఉండిపోయి అనుకోని విధం గా కనుగొనబడ్డాయి.చాలా ప్రాంతం వరకు కూలగొట్టబడిన గుళ్ళ యొక్క శిధిలాలు పరుచుకుని ఉన్నాయి.ముందు ఇవి కనుగొనబడినప్పుడు ఏవో కొన్ని నిర్మాణాలు ఉండి ఉండవచ్చునని అనుకున్నారు కాని రమారమి 400 గుళ్ళ దాకా ఇప్పుడు లెక్క తేలింది.ఇవి ముస్లిం రాజుల దండయాత్రల్లో ధ్వంసం చేయబడినవా లేదా భూకంపం వచ్చి ఇలా అయినవా అనేది పూర్తిగా నిర్ధారింప బడలేదు.శివుడు,విష్ణువు,పార్వతి,గణేషుడు వంటి దేవతలకి ఇవి అంకితం చేయబడ్డాయి.బందిపోట్లు గా పేరు పొందిన చాలామంది వారి కార్యకలాపాలకి ముందు తమ ఇలవేల్పులైన ఈ దేవుళ్ళ గుళ్ళని దర్శించి పూజించి మరీ వెళ్ళేవారు.









  

Sunday 21 July 2019

ఏనుగుల్ని చంపడానికి యుథనేషియా చట్టం..?


దేశం లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పట్టుబడి బతుకీడుస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కడ ఉన్నదో తెలుసా..? కేరళ రాష్ట్రంలోనే..! రమారమి 507 ఏనుగులు ఆ జాబితాలో ఉన్నాయి. వివిధ దేవాలయాల్లోనూ,ఉత్సవాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు.అయితే కొన్నిసార్లు ఈ ఏనుగుల్లో కొన్ని అనారోగ్యం బారిన పడి బతుకు భారంగా వెళ్ళదీస్తుంటాయి.అలాటి వాటిని కారుణ్య ధృక్పథం తో చంపడానికి యుధనేషియా చట్టాన్ని తెచ్చేందుకు కేరళ రాష్ట్రం ప్రయత్నిస్తోంది.దీనికి తగిన సిఫార్సులను సంబందిత నిపుణులనుంచి తీసుకుంటున్నది.ఈ మధ్య కాలం లో ఏనుగుల్ని నిర్లక్ష్యం గా చూసే మావట్లను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఏనుగులకి వాటి కి సరిపడే ఆహారం ఇవ్వాలి తప్పా తాము ఏది పడితే అది వాటికి పెట్టరాదని దాని సారాంశం.ఏనుగుల మావట్లను తరచూ మార్చరాదని దానివల్ల ఆ జంతువులు ఇబ్బందుల పాలవుతున్నాయని అక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.   

Monday 15 April 2019

సైకత శిల్పి ని ఈ రోజు గుర్తు తెచ్చుకోవలసిందే..!



అనేక మార్లు మనకిది అనుభవమే..! మనం పేపర్ తెరవ గానే పూరి బీచ్ లో వేసిన  ఇసుక శిల్పాన్ని చూస్తాము,ఇంకా దానితో బాటుగా చక్కటి సందేశాన్ని కూడా చూస్తాము.దాన్ని చిత్రించిన శిల్పి సుదర్శన్ పట్నాయక్ అనే పేరు ని కూడా చదివి ఉంటాము.ఈరోజు అతని పుట్టిన రోజు.ఎన్నో దేశ విదేశీ సైకత శిల్పాల పోటీల్లో ఫాల్గొని తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తనకి ఆ కళ ఎన్నో డాక్టరేట్లని,పద్మశ్రీ  అవార్డ్ ని తెచ్చిపెట్టింది.అయితే ఆ పూరీ కుర్రవాని జీవితం ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి.నిజానికి తను డిగ్రీ కూడా చదవలేదు.చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు.తండ్రి ఇంటినుంచి చిన్న తనం లోనే వెళ్ళిపోఅయడు.అయితేనేం తన సృజనా శక్తి తో తన విధిని తనే లిఖించుకున్నాడు.

చిన్నతనం లో ఒక ఇంట్లో పనిమనిషి గా చేసేవాడు.అక్కడ పిల్లలు వేసే బొమ్మలు చూసి తనలో సహజం గా ఉన్న కళ ని మెరుగులు దిద్దుకునేవాడు.ఖరీదైన పేయింట్స్ కొనే స్థోమత లేక పోవడం వల్ల పూరీ బీచ్ కి వెళ్ళి అక్కడ ఇసుక తో రకరకాల బొమ్మలు వేసేవాడు.అవి చూసిన జనాలు మెచ్చుకునే వారు ,అయితే ఇసుక తో వేస్తే అవి ఎంత కాలం ఉంటాయి,గాలి వచ్చినా అలలు వచ్చినా కొట్టుకుపోతాయి గదా అని నిరాశగా అనేవారు.అయితే తనకి మాత్రం దీనిలో బాగా నమ్మకం ఉండేది.ఒక రాత్రి పడుకున్నప్పుడు అనిపించింది ,అసలు జీవితమే పర్మినెంట్ కాదు అలాగని చచ్చిపోతున్నామా అని అనిపించింది.దీనికి
ఒక కొత్తదనాన్ని జోడించాలి,అప్పుడు ఇంకా బాగుంటుంది అని తోచి బొమ్మ వేసి దానికి కేప్షన్ ని సింపుల్ గా,శక్తిమంతం గా రాసేవాడు.క్రమేపి జనాలు వీటిని ఆదరించారు.ప్రాచుర్యం పొందిన తర్వాత ఫలాన సంఘటన కి ఏ బొమ్మ వేసి ఏ కేప్షన్ పెడతాడు అని లోకం ఎదురు చూడసాగింది.దేశ విదేశాల్లో ఎన్నో బహుమతులు పొందాడు.పత్రికలు దేశ వ్యాప్తం గా పోటీలు పడి తన చిత్రాలు ముద్రిస్తుంటాయి ఈరోజున.నాలో ఉన్న సహజ కళ ని నమ్ముకొని ముందుకి పోయిన నన్ను ఆ కళే పైకి తెచ్చింది.ప్రతి ఒక్కరి లోను ఏదో ఒకటి ఉంటుంది,దాన్ని గుర్తించి జీవితాన్ని అర్పించిన రోజున అది తప్పక మనిషి కి అన్నీ ఇస్తుంది అంటాడు మన సుదర్శన్ పట్నాయక్. 

Sunday 3 March 2019

ఇక మాల్గుడి స్టేషన్ కి వెళ్ళి రావచ్చు...!


మాల్గుడి అనే కల్పిత పట్టణం గురించి అందరకీ తెలిసిందే.ఆర్.కె నారాయణ్ నవల ల పుణ్యమాని ఆ పేరు చిర పరిచితం కాగా ,శంకర్ నాగ్ తీసిన మాల్గుడి డేస్ టి.వి. ఎపిసోడ్ ల తో మరింత చేరువ అయింది.అయితే ఇప్పుడు అరసలు అనే కర్నాటక రాష్ట్రం లోని రైల్వెయ్ స్టేషన్ పేరు ని మాల్గుడి రైల్వెయ్ స్టేషన్ గా మార్చబోతున్నారు.ఇందు కోసం రైల్వెయ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.శివ మొగ్గ జిల్లా పరిధి లోని ఈ స్టేషన్ కి ఈ పేరు ని సూచించిన వారు అక్కడి ఎం.పి. రాఘవేంద్ర.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా రాగానే ఈ అరసలు ని మాల్గుడి రైల్వెయ్ స్టేషన్ గా మారుస్తారు.దీని ముస్తాబు కి గాను 1.3 కోట్లు కేటాయించినట్లు వార్త.

ఇంతకీ ఈ అరసలు కి ఇంత ప్రాముఖ్యత ఏమిటంటే శంకర్ నాగ్ చాలా మాల్గుడి ఎపిసోడ్ లని ఈ ప్రాంతం లోనే తీశాడు.ఈ స్టేషన్ చిన్నది...రోజుకి రెండు రైళ్ళు మాత్రమే వచ్చేవి.ఆ సమయం లోనే కొన్ని సన్నివేశాలు తీసేవారు.ఈ ప్రాంతం అంతా బ్రిటిష్ రోజుల్లో ని ఊరు గా కనిపిస్తుందని దీన్ని ఎంచుకొని శంకర్ నాగ్ రచయిత ఆర్.కె. నారాయణ్ కి చూపించగా ఆయన కూడా ఆనందం గా ఓకె చేశాడు.మరి అంత ప్రత్యేకత ఉన్న ఈ అరసలు ని మాల్గుడి గా మార్చడం లో తప్పు ఏముంది..?ఇక ఎవరైనా ఎంచక్కా ఎవరైనా మాల్గుడి వెళ్ళి రావచ్చు.ఇక ఇది ఎంతమాత్రమూ కల్పిత ప్రదేశం కాదు గదా ..ఏమంటారూ..?

Monday 11 February 2019

"దంతెవాడ" (కధలు) గురించి యండమూరి అన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం..!


విన్నూత్నమైన వస్తువు,దాన్ని చెప్పే పద్ధతి ఈ రెండు విషయాల్లోనూ "దంతెవాడ" కదాసంపుటి ఒక ప్రత్యేకత ని సంతరించుకున్నది.చత్తిస్ ఘడ్ లోని ఆ ఊరి పేరు అందరకీ సుపరిచితమే కాని అక్కడి పరిసరాల్లోని సంఘటనల్ని దీనిలో ఓ కధ లో చిత్రించిన తీరు హృదయాన్ని కదిలించితీరుతుంది.బ్రిటీష్ వారి అవశేషాలు ఉన్న ఒక ఊరి లో గల విశేషాలు స్మృతి కధ లో చక్కగా వర్ణించారు.ఒక కోతి ఏ విధంగా  పాఠశాల వాతావరణాన్ని మార్చినదీ మరో కధ లో  తెలుసుకుంటే అబ్బురపడక మానము.రోడ్డు మీద జంతుప్రాయులు గా సంచరించే ముసలామె కధ వళ్ళు జలదరింప చేస్తుంది.మొత్తం పదకొండు కధలు ఉన్న ఈ సంపుటి చదువరి ని ఎంతమాత్రం నిరాశ పరచదు.ఈ పుస్తకం గురించి కవర్ పేజీ  వెనుక మాట గా  ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ చెప్పినట్లు నవ్యత ని ఆస్వాదించే ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి.

(Rs.80/-   :ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,ఆర్య సమాజ్ ముందు వీధి ,కాచి గూడ ,హైదరా బాద్-500027. మొబైల్: 9000413413)

Kinige edition here http://kinige.com/kbook.php?id=9297

Saturday 29 December 2018

ఆంధ్రా ప్రభుదేవా...ఒడిశా లో...!



టి.కృష్ణ మోహన్ రెడ్డి ఒడిశా లోని బరంపురం కుర్రాడు.ఇతను తన ప్రిన్స్ డాన్స్ అకాడమీ ద్వారా ఒక విప్లవమే రేపాడు.తెలుగు వారికి కొదువ ఏముంది అక్కడ.ఒకప్పుడు తెలుగు ప్రాంతమే,కాల మహిమ వల్ల ఆ పట్టణం ఒరిస్సా లో కలిసిపోయింది.ఆ ప్రాంత వాసుల్ని ప్రవాసాంధ్రులు అంటే విజయచంద్ర వంటి కవులు ఒప్పుకోరు గాక ఒప్పుకోరు.ఎప్పుడో మా తాత తండ్రులనుంచి ఇక్కడే ఉన్నాం,పెరిగాం ,ఎక్కడ నుంచీ మేము వలస రాలేదు ..కాకపోతే మా ప్రాంతాన్ని ఒరిస్సా లో కలిపివేయడం వల్ల మేము అలా పిలువబడుతున్నాం..అంతే అంటారు.నేను బరంపురం వెళ్ళి ఆ నేల లో తిరిగిన తర్వాత అది నూటికి నూరు పాళ్ళు నిజమని అనిపించింది.

సరే..ఈ కృష్ణారెడ్డి గా పిలువబడే బరంపురం కుర్రాడి గురించి భుబనేశ్వర్ నుంచి వెలువడే ఓ పత్రిక "మై సిటీ లింక్స్" ఇటీవల రాసింది చదివాక ఇది రాయాలనిపించింది.ఇతను తన జీవిత కధ ని సినిమా గా తీశాడు.అది ఇప్పుడు ఒరిస్సా లో రిలీజ్ అవడానికి తయారు గా ఉంది.ఇంతకీ ఈ యువకుని గొప్పదనం ఏమిటంటే 2009 లో ఓ హిందీ చానల్ లోని " India's Got Talent"  అనే డాన్స్ కాంపిటేషన్ లో పాల్గొని విజేత గా నిలిచి 50లక్షల నగదు,ఆడీ కార్ ని గెలుచుకున్నాడు.ఇతను ట్రూప్ లో 20 మంది ఉంటారు.ప్రిన్స్ డాన్స్ అకాడమీ అనే పేరు తో ఈయన చేసే కృషికి అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించి 2కోట్ల నగదు సాయం ని,భూరి విరాళం ని ఇచ్చి ప్రోత్సహించాడు.

దానితో కృష్ణా రెడ్డి తన కార్యక్రమాల్ని విస్తరించి ఇతర రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ వంటి చోట్ల కూడా పోటీలో ఫాల్గొని గెలిచాడు.ఇప్పుడు తాను తన కధనే సినిమా గా తీశాడు.ఎన్ని అవాంతరాల్ని ఎదుర్కొని తను సక్సస్ గా నిలిచింది దీనిలో వివరించాడు.దీని కధ, స్క్రీన్ ప్లేయ్,డైరెక్షన్ అన్నీ ఆయనే.ఈ సినిమా పేరు "కృష్ణా ,ద డాన్సర్".రెండున్నర గంటల ఈ సినిమా ఒరిస్సా లో బాగా ఆడి తనకి పేరు ఇంకా ఇనుమడింప చేసందని ఆశిస్తున్నాడు.