Thursday 13 May 2021

ఇప్పటికీ ఈ శిఖరం ఓ రహస్యమే..!


 ప్రపంచం లో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. కాని ఆ హిమాలయ శ్రేణుల్లో భాగమైన కైలాస్ శిఖరాన్ని మాత్రం ఇప్పటి దాకా ఎవరూ అధిరోహించలేకపోయారు.ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8850 మీటర్లు కాగా,కైలాస్ శిఖరం ఎత్తు 6638 మీటర్లు మాత్రమే.ఎవరెస్ట్ కన్నా ఎత్తు లో అంత తక్కువ ఉన్న కైలాస్ శిఖరాన్ని ఎందుకని ఎవరూ అధిరోహించలేకపోయారు అనేది ఇప్పటికీ ఓ గొప్ప రహస్యమే..!


ఎక్కడానికి ప్రయత్నించినవారు లేకపోలేదు సుమా..!కల్నల్ విల్సన్ (బ్రిటీష్),సెర్గీ సిస్త్యకొవ్(రష్యన్) వంటి ప్రసిద్ధ పర్వాతారోహక బృందాలు ప్రయత్నించి విఫలమై తిరిగివచ్చారు.సైబీరియా కి చెందిన కొందరు కూడా ప్రయత్నించారు కాని వారు కూడా విజయం సాధించలేకపోయారు.సైబీరియాకి చెందిన వారు ప్రయత్నించిన సంవత్సరం తర్వాత మృత్యు వాత పడ్డారు.ఒక ఏడాది లో పదేళ్ళ లో వచ్చే వృద్ధాప్యం వచ్చింది వారికి.


అధిరోహించడానికి ప్రయత్నించిన వారు అందరూ చెప్పినదేమిటంటే కైలాస్ శిఖరం పరిధిలోకి కొంత దూరం వెళ్ళడం తో గోళ్ళు,వెంట్రుకలు చాలా వేగంగా పెరుగుతాయని తెలిపారు.హిందూ ,బౌద్ధ,జైన,బాన్ మతాల వారికి  కైలాస్ శిఖరం చాలా పవిత్రమైనది.సాక్షాత్ మహాశివుడే తన పరివారం తో ఇక్కడ కొలువై ఉంటాడని హిందూవులు భావిస్తారు.ఇక్కడ దగ్గర లో మానస సరోవరం,రాక్షస తల అనే రెండు సరస్సులు ఉంటాయి.ఒకటి మంచినీటి సరస్సు కాగా మరొకటి ఉప్పు నీటి సరస్సు.  


ఇంకా మిగతా చాలా వివరాలకోసం పైన ఇచ్చిన వీడియో చూడగలరు.

No comments:

Post a Comment