Sunday 21 July 2019

ఏనుగుల్ని చంపడానికి యుథనేషియా చట్టం..?


దేశం లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పట్టుబడి బతుకీడుస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కడ ఉన్నదో తెలుసా..? కేరళ రాష్ట్రంలోనే..! రమారమి 507 ఏనుగులు ఆ జాబితాలో ఉన్నాయి. వివిధ దేవాలయాల్లోనూ,ఉత్సవాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు.అయితే కొన్నిసార్లు ఈ ఏనుగుల్లో కొన్ని అనారోగ్యం బారిన పడి బతుకు భారంగా వెళ్ళదీస్తుంటాయి.అలాటి వాటిని కారుణ్య ధృక్పథం తో చంపడానికి యుధనేషియా చట్టాన్ని తెచ్చేందుకు కేరళ రాష్ట్రం ప్రయత్నిస్తోంది.దీనికి తగిన సిఫార్సులను సంబందిత నిపుణులనుంచి తీసుకుంటున్నది.ఈ మధ్య కాలం లో ఏనుగుల్ని నిర్లక్ష్యం గా చూసే మావట్లను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఏనుగులకి వాటి కి సరిపడే ఆహారం ఇవ్వాలి తప్పా తాము ఏది పడితే అది వాటికి పెట్టరాదని దాని సారాంశం.ఏనుగుల మావట్లను తరచూ మార్చరాదని దానివల్ల ఆ జంతువులు ఇబ్బందుల పాలవుతున్నాయని అక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.   

No comments:

Post a Comment