Showing posts with label జాతీయ వార్తలు. Show all posts
Showing posts with label జాతీయ వార్తలు. Show all posts

Saturday 8 July 2017

రక్షణ దళాల అలవెన్స్ లు ఇలా పెరిగాయి



సియాచిన్ వంటి దుర్గమ ప్రదేశాల్లో పనిచేసే సైనికులకి అలవెన్స్ లు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.గతం లో ఇవి రూ.14000 ఉండగా 30000 కి పెరిగాయి.ఆఫీసర్లకి 42500 దాకా పెరిగాయి.అంతే కాదు CRPF వంటి పేరా  మిలటరీ దళాలకి ఇంకా ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో  పనిచేసే వారికి సైతం 7వ వేతన కమీషన్ పెంచింది.శాంతి భద్రతలు ఉన్న ప్రదేశాల్లో పని చేసే దళాలకి రేషన్ సౌకర్యాన్ని ఎత్తి వేస్తున్నట్లు నిన్న గెజిట్ లో ప్రకటించారు.   

Friday 23 June 2017

మరో 39 స్మార్ట్ సిటీలను ఈ రోజు ప్రకటించారు..తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి ఏమిటంటే...



ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరో 30 స్మార్ట్ సిటీలను ప్రకటించింది.ఆంద్ర నుంచి అమరావతి,తెలంగాణా నుంచి కరీం నగర్ ఈ జాబితా లో చోటుచేసుకున్నాయి. అయితే చత్తిస్ ఘడ్ నుంచి నయా రాయ్ పూర్ ,బిలాస్ పూర్ రెండు సెలెక్ట్ కాగా తమిళ నాడు నుంచి తిరునల్వేలి,తూత్తుకుడి,తిరుచిరాపల్లి మూడు నగరాలు ఎన్నిక అయ్యాయి.మిగతావి వేరే రాష్ట్రాలకి చెందినవి.మొత్తం మీద ఈ విడత ప్రకటన తో 90 నగరాలు స్మార్ట్ సిటీలు గా ప్రకటించినట్లు అయింది.వీటన్నిటికి కలిపి 1,91,155 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నది.  

Sunday 9 April 2017

అతను ఈశాన్య రాష్ట్రాల మైకేల్ జాన్సన్ అని చెప్పాలి.




ఈశాన్య రాష్ట్రాల ల లో రాక్ సింగర్ గా ప్రసిద్దుడైన Michael M Sailo గత  శుక్రవారం అర్ధ రాత్రి మిజోరాం రాస్ట్ర రాజధాని ఐజ్వాల్ లో ఒక బైక్ ప్రమాదం లో మృతి చెందాడు.రాక్,హిప్ హాప్,రాప్,మెటల్ ప్రక్రియల్లో తనకంటూ ఒక బాణీ ని ఏర్పరచుకున్నాడు.అతని భార్య Spi Bawitlung కూడా సింగర్ గా ఉన్నది.అనేక పాటలు పాడి,రాసి,మ్యూజిక్ సమకూర్చి అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన మరణం ఈశాన్య భారతం ని శోక సముద్రం లో ముంచింది.

Friday 7 April 2017

డాక్టర్ ఇంకా రచయిత గా రాణిస్తున్న ఆ ప్రాంత వాసి ఎందరికి తెలుసు...?


                                                                Dr.Gumlat Maio

ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో వైవిధ్యం ఉంది.కాని అది మిగతా ప్రపంచానికి తెలిసింది తక్కువ అనే చెప్పాలి.డాక్టర్ గుంలాట్ మేయొ మేఘాలయారాష్ట్రం లో Bordumsa అనే పట్టణం లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మరో వైపు రచయిత గా కార్టునిస్ట్ గా తన ప్రతిభ ని చూపిస్తున్నారు.ఆయన ఫేస్ బుక్ పేజీ ని ఇప్పటి దాకా 4 మిలియన్ల మంది సందర్శించారు. ఆయన రాసిన Once upon a time in a college"  అనే ఆంగ్ల నవల ఇప్పటికి రెండు సంపుటులు గా వెలువడింది.ఇవి అమెజాన్,ఫ్లిప్ కార్ట్ ల లో లభ్యమవుతున్నాయి. ఖాళీ ఏ మాత్రం దొరికినా రచనలు చేస్తుంటానని తెలుపుతున్నారు.రస్కిన్ బాండ్,జెరోం కె జెరోం, కిరణ్ దేశాయ్ ,అరుంధతి రాయ్ ఇట్లా చాలా మంది రచయితల్లో ఒక్కో సంవిధానం తనకి నచ్చుతుందని ప్రాంతీయ భాషల్లో కాక ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంగ్లీష్ లో రాసేవారు ఇప్పుడు పెర్గుతున్నారని తెలిపారు.


నాగా లాండ్ గురించి తెలిపే TemsulaAo  రచనలు,సిక్కిం నుంచి రాస్తున్న వారు బాగా అలరిస్తున్నారని అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంగీత ప్రియులని 20 నుంచి 50 రాక్ బ్యాండ్ లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయని రచనా రంగం లో దానితో పోలిస్తే తక్కువ గానే ఉన్నారని అభిప్రాయపడ్డారు.AIIMS ధిల్లీ లోను ,ఇటా నగర్ లోని రామకృష్ణ హాస్పిటల్ లోను ఉత్తర బెంగాల్ లోని మెడికల్ కాలేజి లోను గతం లో పనిచేశానని అన్నారు.

Thursday 23 February 2017

వికటించిన శోభా డే ట్వీట్



గత మంగళ వారం సోషలైట్ , రచయిత్రి శోభా డే ఒక ట్వీట్ చేసింది.ముంబాయి స్థానిక ఎన్నికలు జరిగినపుడు ఆ భద్రతా పరమైన విధుల్లో  లావు గా కనిపించిన ఒక పోలీస్ అధికారి ఫోటొ ని ట్వీట్ చేస్తూ భారీ బందోబస్త్ జరిగింది అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఇది ముంబాయి పోలీస్ లది అని ఆమె అనుకుంది...అయితే ముంబాయి పోలీస్ దానికి స్పందించి ఈ ఫోటో తమ ముంబాయి పోలీస్ వర్గాలది కాదని పద్దతి గా వ్యాఖ్యానించడం నేర్చుకొమ్మని  సలహానిచ్చింది.అయితే ఈ ఫోటో మధ్య ప్రదేశ్ కి చెందిన దౌలత్రాం జోగేవత్ అనే పోలీస్ ఉద్యోగిది ..దీన్ని చూసిన ఆయన తీవ్రంగా స్పందించాడు,బందో బస్త్ కి ముంబాయి వెళ్ళినప్పుడు ఇది తీశారని,అయితే తాను బాగా తిని లావు ఎక్కలేదని తనకి 1993 లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగిన పిమ్మట అనారోగ్యం వల్ల అలా అయినానని తన మీద అనుచిత వ్యాఖ్యాలు చేసిన శోభా డే మీద ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం లో తన పై అధికారు తో సంప్రదిస్తున్నానని చెప్పాడాయన.

Sunday 22 January 2017

ముగ్గురు విద్యార్థుల్ని బహిష్కరించిన SFI...



కేరళ రాష్ట్రం లో ఎర్నాకులం మహారాజా కాలేజీ లో ప్రిన్సిపాల్ కుర్చీ ని తగలబెట్టిన విషయం లో   లో CPM పార్టీ కి అనుబంధం  గా ఉన్న SFI నుంచి ముగ్గురు విద్యార్థుల్ని ఆ సంఘం బహిష్కరించింది.CPM ఇంకా SFI రెండు వర్గాల నాయకులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గత గురు వారం జరిగింది.గత నెల లో గోడల పై అసభ్య రాతలు రాసినందుకు ప్రిన్సిపాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దాని తో ఆ ముగ్గురు విద్యార్థుల ని అరెస్ట్ చేసి ఇటీవలనే బెయిల్ పై వదిలారు.బయటకి వచ్చిన ఆ ముగ్గురు ప్రిన్సిపాల్ కుర్చీ ని బయటకి తీసుకు వచ్చి నిప్పంటించారు.ఈ విషయం మీద ఆ రాష్ట్ర అసెంబ్లీ లో విపక్ష నేత రమెష్ చెన్నితల నిప్పులు చెరగడం తో ఈ చర్య తీసుకున్నారు.  

Tuesday 10 January 2017

ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి లో మూడవ వరుస లో నిలిచింది.



ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి లో మూడవ వరుస లో  నిలిచింది.ఇంతకీ దేనిలో అనుకుంటున్నారు , అతి చెత్త నిర్వహణ లో ! విమాన సర్వీసుల  ఆలశ్యం తీరు ,కేబిన్లు,మిగతా సర్విసుల క్వాలిటీ లని పరిగణన లోకి తీసుకొని ఫ్లైట్ డేటా ఫర్మ్ అనే సంస్థ ఈ లెక్కల్ని వేసింది.మిగతా పది చెత్త కింద నిలిచినవి ఏవో తెలుసునా..అవి ఎయిర్ చైనా,హాంగ్ కాంగ్ ఎయిర్ లైన్స్ ,ఫిలిప్పైన్ ఎయిర్ లైన్స్,ఖతర్ ఐర్ లైన్స్ ఇలా తేలాయి.కాగా ఈ సర్వెయ్ సరైనది కాదని ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. 

Friday 30 September 2016

జయలలిత ఆరోగ్యం నిర్ధారిస్తూ ఫోటో విడుదల చేయాలి : కరుణానిధి



గత వారం రోజులు గా అనారోగ్య కారణాల తో అపోలో హాస్పిటల్ లో ఉన్న తమిళ నాడు ముఖ్యమంత్రిణి జయలలిత ఆరోగ్యం ఎలా ఉందో నిజాలు వెల్లడి చేయాలని ,అందుకు గాను ఆమె ప్రస్తుత ఫోటో ని ప్రజల కోసం పత్రికలకి విడుదల చేయాలని డి ఎం కె అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు.ఆమె ని సందర్శించడానికి  వెళ్ళిన మంత్రులు పొన్ రాధాకృష్ణన్ వంటి వారు ఎందుకని ఆ విషయం లో నోరు విప్పడం లేదన్నారు.నిజాలు ప్రజలకి తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే అధికార పక్ష ప్రతినిధి సరస్వతి మాట్లాడుతూ వైద్యుల కోరిక మేరకు ఆమె కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు.

Monday 12 September 2016

జీన్స్ తయారీ లోకి వస్తోన్న రాం దేవ్ బాబా ...



దాదాపు గా 500 రకాల ఉత్పత్తుల్ని స్వదేశీ పేరు తో పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అమ్ముకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.రాం దేవ్ బాబా స్థాపించిన ఈ కంపెనీ త్వరలో జీన్స్ తయారీ లొకి దిగబోతున్నది.ఈ మేరకు ఒక విదేశీ సంస్థ తో చర్చలు జరుగుతున్నాయి.పూర్తిగా విదేశీ తరహా దుస్తులు గా చెప్పబడే జీన్స్ ని మార్కెట్ ఏ పేరు తో చేస్తారో వేచి చూడవలసిందే.1800 సంవత్సరం లో ఇటలీ లోని జెనోవా నుంచి అమెరికా కి ఈ జీన్స్ లు రావడం జరిగింది.మొదట్లో తాపీ పనివాళ్ళు,రైతులు,ఇతర మోటు పనిచేసేవారు ఈ డెనిం తో చేసిన జీన్స్ ని ధరించేవారు.పోను పోను అమెరికన్ పాప్ కల్చర్ లో ఒక భాగమయ్యి క్రమేణా అనేక దేశాల్లో జీన్స్ విస్తరించింది.

Monday 22 August 2016

విడాకులు పొందటం కూడా కష్టం కావడమే దీనికి కారణమా...?



దంపతులు విడి పోవడం ఇంకా విడాకులు తీసుకోవడం వంటివి కేవలం పట్టణాలకి ,నగరాలకే పరిమితం కాలేదు,మన దేశం లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాదిరి పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్నదని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.2011 లో తీసిన జనాభా లెక్కల్ని అనుసరించి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా  పై స్థానం లో ఉంది.28,754 మంది వేరు పడిన వాళ్ళు ఉండగా, తెలంగాణా లో డైవర్స్ తీసుకున్నవాళ్ళు కరీం నగర్ జిల్లా లో ఎక్కువ గా ఉన్నారు.7,922 మంది అక్కడ సంఖ్య అని భోగట్టా.ఈ గణాంకాలు హైదరా బాద్ లోని వారి కంటే ఎక్కువ,అక్కడ వేరు పడి జీవిస్తున్న వారు 8,195 మంది కాగా కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నవారు 3,912 గా ఉంది.ఇక విశాఖ లో సెపరేట్ అయిన వారు 19,689 కాగా విడాకులు పొందిన వారు 3,782 గా ఉన్నారు.డైవర్స్ తీసుకున్న వారి కంటే ,తీసుకోకుండా వేరు గా జీవిస్తున్న వారే ఎక్కువ.దేశం మొత్తం మీద చెప్పాలంటే సెపరేట్ గా ఉంటున్న వారు 35,35,202 మంది కాగా విడాకులు పొందిన వారు 13,62,316 మంది మాత్రమే.

Sunday 21 August 2016

కేరళ లో బీఫ్ ఎందుకని ఫేవరేట్ కూర..?



మన దేశం లో కేరళ రాష్ట్రం లోని ప్రజల టేస్టే వేరు.బీఫ్ ఫ్రై అనేది చాలా సాధారణంగా తినే వంటకం.క్రైస్తవులు,ముస్లింలనే కాదు హిందువుల లో కూడా చాలా మంది సర్వ సాధారణంగా  తింటారు.దోసె,ఇంకా ఇతర వాటి తో కలిపి తింటారు.అందు లోను నస్రాని తీరు లో చేసే బీఫ్ కి ఆదరణ ఎక్కువ.కేరళ లో ముస్లిం లు 23 శాతం,క్రైస్తవులు 19 శాతం,హిందువులు 56 శాతం ఉంటారు.పండుగలు కాని,తినడం లో గాని కలిసి మెలిసి చేసుకొనే ఆచారం మొదటి నుంచి ఎక్కువ.మతాల మధ్య అంతర్వివాహాలు సాధారణమైన విషయం.అన్ని ఫుడ్ ఐటంస్ ని బోర్డ్ మీద రాసినట్లే బీఫ్ ని కూడా రాస్తారు.1950 ల నుంచి కమ్యూనిజం  ప్రభావం ఎక్కువ కావడం,మతాల మధ్య సామరస్య ధోరణి ఇలాంటివి కేరళ ని బీఫ్ విషయం లో మిగతా రాష్ట్రాల నుంచి వేరు గా ఉంచిందని చెప్పాలి.

Monday 8 August 2016

జాతీయ గీతాన్ని పాడటం లో తప్పు లేదు: ఎం.ఏ ఖలీద్



అలహాబాద్ లోని సైదా బాద్ లో ఉన్న ఒక పాఠశాల యాజమాన్యం జాతీయ గీతం పాడటాన్ని వ్యతిరేకించిన నేపధ్యం లో నేడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ముంబాయి లో అనేక పాఠశాలలు,కాలేజీ లను నడిపే అంజుమన్ -ఎ-ఇస్లాం ట్రస్ట్ అధ్యక్షుడు జహీర్ కాజీ ఈ చర్యని ఖండిస్తూ ముందు దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని ,జాతీయ గీతాన్ని పాడగూడదని   నిషేధించరాదని తెలిపారు.సామాజిక కార్యకర్త ఎం.ఏ.ఖలీద్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం అజాద్ వంటి వారే జాతీయ గీతం పాడారని,దేశ ప్రజల్ని ఏకం చేసే జాతీయ గీతాన్ని అవమానించరాదని చెప్పారు.

Sunday 31 July 2016

జైలు లో అంతర్యుద్ధం, ముగ్గురు మృతి



నిన్న శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని సాజివ సెంట్రల్ జైలు లో సౌది అరేబియా దేశానికి చెందిన ఇద్దరు ఖైదీలు యూసుఫ్(21),అబ్దుస్(22) లు జైలు లోనే ఉన్న మరో ఖైదీ థాంగ్ మిన్లిన్ జొవ్ ని ఆయుధాల తో పొడిచి చంపారు.దాని తో రెచ్చిపోయిన మిగతా ఖైదీలంతా కలిసి ఈ ఇద్దరు ఖైదీలని కొట్టి చంపారు.ఈ సంఘటన పట్టపగలు ఒంటి గంటకి జరిగింది. మరణించిన యూసుఫ్,అబ్దుస్ ల్ని మైన్మార్ ,మణిపూర్ రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా సంచరిస్తుండడం తో కొద్ది కాలం క్రిందట అరెస్ట్ చేశారు. మూడు మృత దేహాల్ని ఆసుపత్రికి పంపినట్లు మణిపూర్ రాష్ట్ర డిజిపి (ప్రిజన్స్) పి.దౌంజెల్ మీడియా కి వెల్లడించారు. 

Thursday 21 July 2016

అడ్వకేట్ల చేతి లో జర్నలిస్ట్ లకి గాయాలు...



ఈ రోజు కేరళ రాజధాని తిరువనంతపురం లోని హైకోర్ట్ లో న్యాయవాదులకి,జర్నలిస్ట్ లకి వాగ్వివాదం చెలరేగి దెబ్బలాట కి దారి తీసింది.ఆసియా నెట్ టివి,జీవన్ టివి రిపోర్టర్లకి గాయాలయ్యాయి.జూలై 14 న గవర్నమెంట్ ప్లీడర్ ధనేష్ మాథ్యు మంజురన్ ని ఒక మహిళ ని కించపరిచిన కేసు లో అరెస్ట్ చేయడం జరిగింది,ఆ తరువాత బెయిల్ కూడా వచ్చింది.ఈ ఘటన విషయం లో  వివరణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాటా మాటా పెరిగి  అడ్వకేట్లు జర్నలిస్ట్ ల్ని చితక బాదారు. 

Sunday 17 July 2016

తన గోడ పక్కన మూత్రం పోశాడని కాల్పులు జరిపిన డాక్టర్.



నిన్న శనివారం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో చిన్న కారణానికి తుపాకి తీసి కాల్పులు జరిపాడు ఒక హోమియోపతి డాక్టర్ . ఇంతకీ కారణం ఏమిటంటే ఆయన క్లినిక్ కి దగ్గర లోని ఒక చెత్త కుప్ప మీద మహేశ్వర్  రౌత్రాయ్ అనే ఉద్యోగి మూత్రం పోశాడట. ఎందుకు అక్కడ మూత్రం పోశావు అని డాక్టర్ ప్రధాన్ గద్దించి అడగ్గా ,అది చెత్త కుప్ప కాబట్టి పోశా నీకెందుకు అని జవాబిచ్చాడు రౌత్రాయ్.మాటా మాటా పెరిగి డాక్టర్ ఆవేశం తో లోనికి వెళ్ళి తుపాకి తెచ్చి రౌత్రాయ్ మీద కాల్పులు జరిపాడు.ఎడమ కాలుకి బాగా గాయం అయి రక్తం కారుతుండటం తో కటక్ లోని  ఆసుపత్రికి చేర్చారు.కాల్పులు జరిపి తాపీ గా పేషంట్ లని చూస్తున్న డాక్టర్ ప్రధాన్ ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రిని ధ్వంసం చేశారు. 

Thursday 14 July 2016

స్మృతి ఇరాని చేసిన నియామకాన్ని ఆపిన ప్రధాని కార్యాలయం



స్మృతి ఇరాని మానవ వనరుల శాఖా మంత్రి గా ఉన్నప్పుడు చేసిన నియామకాన్ని ప్రస్తుతం ప్రధాని మంత్రి కార్యాలయం అనుమతించనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి.డా.సర్వేంద్ర విక్రం బహదూర్ సింగ్ ని C.B.S.E. (సెకండరీ విద్య) చీఫ్ గా ఆమె నియామకం చేయడానికి పచ్చ జెండా ఊపగా ,మళ్ళీ తదుపరి ఉత్తర్వులు ప్రధాని ఆధీనం లో ఉన్న అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఇస్తుందని అంత వరకు ఆ పోస్ట్ ఖాళీ గా ఉంటుందని తాజా గా లేఖ HRD మంత్రిత్వ శాఖ కి అందింది.2014 నుంచి ఈ పోస్ట్ లో రెగ్యులర్ అధికారి గా ఎవరూ లేరు.కనీసం మూడేళ్ళు విద్యా శాఖ పరిపాలన లో అనుభవం ఉన్న వారికి మాత్రమే ఈ నియామకం లో ప్రాముఖ్యతనిస్తారు.ఆ విధంగా చూస్తే మరో ఇద్దరు అధికారులు సింగ్ కంటే ముందు ఉన్నట్లు భోగట్టా.

Sunday 10 July 2016

మొత్తానికి శవం నిన్న దొరికింది.



ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కి సమీపం లోని మంచేశ్వర్ లోని ఒక స్లం ప్రాంతం లో అశోక్ దాస్, దీప దంపతులు తమ అయిదేళ్ళ పాప తో గత కొన్ని నెలలుగా నివసిస్తున్నారు.ఉన్నట్టుండి అశోక్ మాయమవడం,భార్య కూడ వేరే చోట కి మకాం మార్చడం తో తెలిసిన ఇరుగు పొరుగు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఇంటి వెనుక వాసన రావడం తో నిన్న శనివారం మేజిస్ట్రేట్ సమక్షం లో తవ్వగా అశోక్ శవం లోపల కనిపించింది.అయితే ఆ శవాన్ని చాలా జాగ్రత్త గా అయిదు పొరలుగా ప్లాస్టిక్ పదార్ధాల్ని పేర్చి దాని కింద కప్పెట్టారు.కియోంజర్ జిల్లా  కి చెందిన ఈ జంట కొంత కాలం కిందట ఇక్కడకి వచ్చారు.అశోక్ (35) డ్రైవర్ గా పని చేస్తున్నాడు.భార్య భర్తలు తరచు తగాదాలు పెట్టుకొనేవారని ఇరుగు పొరుగు తెలిపారు.భార్య దీప కనిపించకుండా పోవడం తో ఆమె తో పాటు ఇంకెవరి హస్తమైనా ఉందా అని పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Thursday 16 June 2016

ఆ స్వచ్చంధ సంస్థ గుర్తింపు ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం



ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సబ్రంగ్ ట్రస్ట్ అనే ఎన్ జి వొ యొక్క గుర్తింపు ని రద్దు చేసింది.దీనిని తీస్తా సెతల్వాడ్ అనే సామాజిక కార్యకర్త నడుపుతున్న విషయం తెలిసినదే. విదేశాల నుంచి వచ్చిన నిధులను నిర్దేశించబడని ఇతర పనులకు కేటాయించారనే కారణం తో ఈ చర్య తీసుకున్నారు.FCRA నిబంధనల్ని ఉల్లంఘించి ఓ పబ్లిషింగ్ కంపెని కి 50 లక్షలు  తరలించినట్లు అభియోగం.ఈ ఎన్ జి వొ గుజరాత్ సంఘర్షణల్లో బాధిత ముస్లిం ల తరపున చురుకు గా పనిచేసి 2002 ప్రాంతం లో అప్పటి మోడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టింది. 

Monday 6 June 2016

మేధా పాట్కర్ కి చుక్కెదురు..



నిన్న ఆదివారం ఒరిస్సాలోని వేదాంత అల్యూమినియం ప్రాజెక్ట్ కి వ్యతిరేకం గా మేధా పాట్కర్ ఆధ్వర్యం లో లాంజిగడ్ వరకు తలపెట్టిన ర్యాలిని కలహండి జిల్లా లోని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు.ప్రాజెక్ట్ కి ఇప్పటికే స్థానికులు భూమి ని ఇచ్చిఉన్నారని,కంపెనీ కూడా స్థానిక ప్రజల కోసం ఆసుపత్రులు,పాఠశాలలు వంటివి నెలకొల్పిందని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారని ,ఈ విషయం లో బయటి వ్యక్తులు వచ్చి  తమ అభివృద్దిని అడ్డుకోవద్దని నిరసన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం తలపెట్టడం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికేనని నియమగిరి సురక్షా సమితి నాయకులు తెలిపారు. 

Tuesday 31 May 2016

పులకింపజేసే డార్జిలింగ్ పర్యటన


మన దేశానికి ఈశాన్య భాగం లో ఉన్న చక్కని పర్వతీయ పట్టణం డార్జిలింగ్.ప్రకృతి సౌందర్యం కలబోసినట్లు ఉండే ఆ పట్టణం నుంచి చూస్తే మనకి హిమాలయల లోని కాంచన్ జంగ పర్వత శిఖరం దేదీప్యమానంగా కనపడుతుంది.సముద్ర మట్టానికి 6,710 మీటర్లు ఎత్తున ఉండే ఈ పట్టణం కి మనం ఈ మే నెల లో వెళ్ళినా రమారమి 14 డిగ్రీల సెల్సియస్  కి మించదు తాపం.టీ తోటలు ఇతర పండ్ల తోటలతో కళకళ లాడే ఈ పట్టణాన్ని చాలామంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.నేపాల్ నుంచి వచ్చిన గూర్ఖాలు ఇక్కడ ఎక్కువగా స్థిర నివాసం ఉంటారు.అలాగే టిబెటన్ లు,భూటానీస్ కూడా తక్కువ సంఖయలో ఉంటారు.గూర్ఖాలు హిందువులు కాగా మిగతా వారు బుద్దిస్ట్ లు .క్రీ.శ.1800 ల లోనే బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని వేసవి విడిది గా ,విశ్రాంత ప్రదేశం గా వాడుకునేవారు.మార్క్ ట్వైన్ వంటి రచయిత కూడా ఈ ప్రాంతాన్ని దర్శించి గొప్ప ప్రశంసలు కురిపించాడు.



ఇక్కడనుంచి సిక్కిం రాజధాని గాంగ్టక్ కి నాలుగు గంటలు ప్రయాణం.గత ఏడాది నేపాల్ లో వచ్చిన భూకంపం వల్ల ఇక్కడ కూడా ప్రకంపనలు వచ్చాయి గాని నష్టం ఏమీ జరగలేదు.ఈ సీజన్ లో కొద్దిగా టూరిస్ట్ లు తగ్గినా మళ్ళీ క్రమేపీ పుంజుకుంటున్నదని ,హోటళ్ళు పూర్తిగా బుక్ అయ్యాయని అక్కడి ప్రతినిధులు చెబుతున్నారు.